హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే రెండో దఫా కంటి వెలుగు పథకం అమలుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో జరగబోయే ఈ సమావేశంలో అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు పాల్గొననున్నారు. జనవరి 18వ తేదీ నుంచి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో, యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు.
కంటి వెలుగు పథకాన్ని తొలిసారిగా 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది కూడా. అయితే.. పథకంలో భాగంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసింది ప్రభుత్వం.