తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో హరీశ్ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.