హైదరాబాద్: తెలంగాణ (Telangana) ప్రగతిలో అమరుల (Martyrs) త్యాగనిరతి ప్రకాశిస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. అమరుల త్యాగం అజరామరమని, వారి స్ఫూర్తి ప్రజ్వలిత దీప్తి అని చెప్పారు. ఉద్యమ ధ్రువ తారలకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణ త్యాగం చేసిన అమరులకు వినమ్ర శ్రద్ధాంజలి
తెలంగాణ ప్రగతిలో ప్రకాశిస్తున్నది మీ త్యాగనిరతి
అమరుల త్యాగం.. అజరామరం
అమరుల స్ఫూర్తి.. ప్రజ్వలిత దీప్తి
ఉద్యమ ధ్రువ తారలకు ఘన నివాళి
జై తెలంగాణ ✊ pic.twitter.com/DjHwSpJKMM— Harish Rao Thanneeru (@BRSHarish) June 22, 2023