కరీంనగర్: పితృవియోగంతో బాధలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య (87) గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని గంగుల ఇంటికి చేరుకున్న మంత్రులు హరీశ్ రావు, కొప్పుల, ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్.. మల్లయ్య పార్ధివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, మంత్రి గంగుల తండ్రి అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో జరుగనున్నాయి.