హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 123 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, స్వరాష్ట్రంలో వాటిని సీఎం కేసీఆర్ 1,011కు పెంచారని కొనియాడారు. గురుకుల పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేయడంపై హరీశ్రావు ట్విట్టర్లో హర్షం వ్యక్తంచేశారు. ఒకవైపు మౌలిక వసతులు, మరోవైపు నాణ్యమైన బోధనతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్స్థాయి విద్యను అందిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్ పేర్కొన్నారు. 9,231 పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గురుకులాల్లో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయడం ఆనందంగా ఉందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. 9,231 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగుల కలలు నెరవేరుతున్నాయని జనగణన వేదిక నేషనల్ చైర్మన్ గోసుల శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. గురుకుల నోటిఫికేషన్ జారీ చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడం హర్షణీయమని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ బాలరాజు పేర్కొన్నారు.