హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ‘అది ఉద్యమైనా, స్మారక చిహ్నమైనా కేసీఆర్కు సాటి మరెవ్వరూ లేరు, రాలేరు’ అని మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హరీశ్రావు ట్వీట్ చేశారు. ‘ఒకనాడు తెలంగాణ పదం ఉచ్ఛరణనే నిషేధించారు. నేడు తెలంగాణ అందరికీ స్మరణీయం. ఆచరణీయం అయ్యేలా కేసీఆర్ చేశారు.’ అని పేర్కొన్నారు. ఉద్యమం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఆకాంక్షలు నెరవేర్చే సౌధం: ఎమ్మెల్సీ కవిత
సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన సచివాలయం ప్రజల ఆకాంక్షలు నెరవేరు స్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆమె ట్విట్ట ర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు