మెదక్/రామాయంపేట/దుబ్బాక టౌన్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రేమ సీఎం కేసీఆర్కు తప్పా మరో ప్రాంతానికి చెం దిన వారికి ఎందుకుంటుందని ప్రశ్నించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని దు బ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. రామలింగారెడ్డి సతీమణి సుజాత, కొడుకు బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు సతీశ్రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మెదక్ జిల్లా రామాయంపేటలో నూతన రెవెన్యూ డివిజన్ను ప్రారంభించారు.
డిగ్రీ కళాశాల, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మా ణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.45 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ మాయ మాటలు నమ్మి దుబ్బాకలో గెలిపిస్తే ఆ ఎమ్మెల్యే మూడేండ్లుగా చేసిందేమీ లేదని విమర్శించారు. రామలింగారెడ్డి చేసిన పనులకే నేడు ఎమ్మెల్యే రఘునందన్రావు రిబ్బన్లు కట్ చేస్తున్నారే తప్పా మరో అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవని తెలిపారు. ఇప్పుడు కొత్తగా చీరెలు, సారెలు, గొడుగులు ఇస్తామంటూ మోసం చేసేందుకు సిద్ధ్దపడుతున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక రూపురేఖలను మార్చిన ఘనత రామలింగారెడ్డికే దక్కుతుందని తెలిపారు. దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగిరితేనే రామలింగారెడ్డి ఆత్మకు శాంతి కలుగుతుందని, తద్వారా దుబ్బాకకు పూర్వ వైభవం దక్కుతుందని చెప్పారు.
ధన బలమా.. జన బలమా?
రేపు మెదక్లో జరుగబోయే ఎన్నిక ధన బలానికి, జన బలానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పాండవులకు, కౌరవులకు మధ్య…న్యాయానికి, అన్యాయానికి మధ్య పోటీ జరగబోతున్నదని చెప్పారు. ‘మెదక్లో పద్మా దేవేందర్రెడ్డి ప్రతి పని చేశారు. మెదక్.. జిల్లా కేంద్రమైంది.. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు వచ్చినయ్..రైలు వచ్చింది. రామాయంపేట్ రెవె న్యూ డివిజన్ అయ్యింది. డిగ్రీ కళాశాల వచ్చిం ది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగికి నీళ్లొస్తున్నయ్’ అని వివరించారు. ఈ పనులు ఆగకుండా ముందుకు సాగాలంటే కారుగుర్తుకు ఓటేసి పద్మాదేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘సద్ది తిన్న రేవు తలవాలి.. పైసల సంచులకు లొంగద్దు.. ధన బ లం కాదు ప్రజాబలం గెలువాలి.. ప్రజలకు ప నిచేసే నాయకులు గెలువాలి’ అని పేర్కొన్నా రు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో చివరకు గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని హరీశ్రావు ధీమా వ్యక్తంచేశారు.
సిగ్గులేకుండా మాట్లాడుతున్న రేవంత్
టీడీపీలో ఉండగా కాంగ్రెస్ పార్టీని తిట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ అభివృద్ధి చేసిందంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. నాడు సోనియాగాంధీని బలిదేవత అని తిట్టిన రేవంత్ ఈ రోజు పీసీసీ కుర్చీలో కూర్చొ ని దేవత అంటున్నాడని ఎద్దేవా చేశారు. 50 ఏండ్ల కాంగ్రెస్.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై రేవంత్ చర్చ చేస్తా అంటున్నాడని, టీడీపీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పాలనను విమర్శించిన రేవంత్రెడ్డి, ఆనాడు మాట్లాడిన మాట నిజమా? ఈనాడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్న మాట నిజమా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ‘రేవంత్రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఓట్ల కోసం దిగజారే ఊసరవెల్లి’ అని ఎద్దేవా చేశారు.
మాట ఇచ్చినా.. రెవెన్యూ డివిజన్ తెచ్చినా
‘రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని 500 రోజులు నిరాహార దీక్షలు చేశారు.. ఎప్పుడు అవకాశం వచ్చినా ఇది రెవెన్యూ డివిజన్ చేస్తానని మాట ఇచ్చినా.. సీఎం కేసీఆర్ మెదక్కు వచ్చి మాట ఇచ్చి రెవెన్యూ డివిజన్ చేశారు’ అని హరీశ్రావు గుర్తుచేశారు. నాడు తాను వచ్చినప్పుడు రెవెన్యూ డివిజన్ తీసుకొస్తే రామాయంపేట అంతా తమ వైపు వస్తామని అన్నారని, ఇప్పుడు కాంగ్రెసోళ్లంతా బీఆర్ఎస్లోకి వస్తారా? అని ప్రశ్నించారు. రామాయంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, ఆది పోగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితభూంరెడ్డి, జట్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ జాకీ పెట్టి లేపినా లేచేది లేదు..ఇక కాంగ్రెస్ గెలిచేది లేదు. రెండు పార్టీలు పాలపొంగులా తుస్సుమంటాయి. ఎన్ని జిమ్మిక్కులు చేసినా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది
-మంత్రి హరీశ్రావు
ఎన్నికలకు ముందు దుబ్బాకలో బీజేపీ అరచేతిలో వైకుంఠం చూపించింది. రైతులకు ఎడ్లు, బండ్లు, నిరుద్యోగులకు భృతి, చేనేత, బీడీ
కార్మికులకు పింఛన్లు, టెక్స్టైల్స్ పార్కు, రింగురోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటూ నమ్మించి తీరా మోసం చేసింది. దుబ్బాక ప్రజలు
మళ్లీ అలాంటి మోసపు మాటలు నమ్మొద్దు.
-మంత్రి హరీశ్రావు
మెదక్ నియోజకవర్గంపై కొంతమంది నాయకులు కన్నేశారు. పైసల సంచులు వేసుకొని మెదక్ మీద పడుతున్నారు. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్టు వస్తున్నారు. ఓట్ల కోసం డబ్బుల సంచులు పట్టుకొని వచ్చేటోడు కావాల్నా? మనం ఆపదలో ఉంటే మనకు తోడులా ఉన్నవాళ్లు కావాల్నా? ప్రజలు ఆలోచించుకోవాలి.
-మంత్రి హరీశ్రావు
పద్మమ్మ అంటే కేసీఆర్కు ఎంతో ప్రేమ
‘సీఎం కేసీఆర్కు పద్మమ్మ అంటే చాలా ప్రేమ ఉంది కాబట్టే మెదక్ను జిల్లా కేంద్రం చేసిండు. రామాయంపేటను డివిజన్కేంద్రం చేసిండు. నా బిడ్డ పద్మమ్మ అని అన్నారు’ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పద్మాదేవేందర్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచి మెదక్ నుంచి వరంగల్ వరకు సైకిల్ తొక్కారని, ఝాన్సీరాణిలా ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. పద్మాదేవేందర్రెడ్డి అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ రామాయంపేటకు డిగ్రీ కళాశాలను మంజూరు చేశారని పేర్కొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐడీసీ కింద రూ. 20 కోట్లు మంజూరు చేశారని, ఈ రోజు అభివృద్ధి పనులకోసం రామాయంపేట మున్సిపాలిటీకి రూ.45 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.