సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సరాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందన్నారు. కాళేశ్వరం జలాలతో కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని, రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లుతున్నారు. ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు హరీశ్రావు తెలిపారు.