సంగారెడ్డి: కాంగ్రెస్ (Congress) అంటే దొంగరాత్రి కరెంటు.. బీఆర్ఎస్ (BRS) అంటే 24 గంటల ఉచిత కరెంట్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ నేతలు తిట్ల దండకం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ను ఉత్త విద్యుత్గా మార్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth reddy) 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాల పొలం పారుతుందని చెప్పారు. రేవంత్రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. సంగారెడ్డిలో లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను, పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ పత్రాలను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఎందుకు లేదని నిలదీశారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో రాష్ట్రంలో గ్రామాల సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు.
3 శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి 38 శాతం అవార్డులు రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని మంత్రి హరీశ్ అన్నారు. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. కులవృత్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీసీ బంధు ఇస్తున్నామని చెప్పారు. వెనుకబడిన వర్గాలవారికి రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నామని చెప్పారు. 35 వేల సెలూన్లు, 60 వేల లాండ్రీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాకముందు 19 బీసీ గురుకులాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 310కి చేరిందన్నారు. బీసీల కోసం ప్రభుత్వం వంద కోట్లు ఖర్చుచేస్తున్నదని తెలిపారు.