హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురసరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో మంగళవారం మంత్రి ఆవిషరించారు. జాతీయ కుటుంబ అరోగ్య సమీక్ష గణాంకాల ప్రకారం శిశువులకు తల్లి పాలు అందించడంలో దేశ సగటు 63 శాతం ఉండగా.. తెలంగాణ మాత్రం 68 శాతంతో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. భవిష్యత్తులో బిడ్డలకు రోగాలు రాకుండా కాపాడటంలో తల్లి పాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
అందుకే తల్లిపాలను ద్రవ బంగారంగా పిలుస్తామని పేర్కొన్నారు. నవజాత శిశువులకు పాలు పట్టడం ద్వారా తల్లికి కూడా ప్రయోజనం కలుగుతుందని, పాలిచ్చే తల్లులకు భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ సీవోవో విశ్వనాథ్ స్వరూప్, హెల్త్ సెక్రటరీ రీజ్వి తదితరులు పాల్గొన్నారు.