Minister Harirsh Rao | కాంగ్రెస్ వాళ్ళది సుతి లేని సంసారమని.. వాళ్లకు వల్లే తన్నుకు చస్తున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరిలో ఎగిరెది గులాబీ జెండేనన్నారు. ఫైళ్ల శేఖర్రెడ్డి మంచి మనిషి అని.. సాయం చేసే వ్యక్తని, కల్మషం లేని వ్యక్తి అన్నారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తారన్నారు.
మంగళవారం నుంచి రైతుబంధు డబ్బులు అన్నదాతలు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి నిరోధకులు అన్నారు. ఐదుగంటల కరెంటు ఇస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుండబద్దలు కొట్టిండన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడిందని.. కరంట్ కావాలంటే బీఆర్ఎస్కే ఓటెయ్యాలన్నారు. కాంగ్రెస్ వస్తే కటిక చీకట్లేనని.. అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కారు, కేసీఆర్తోనే 24 గంటల కరంట్ వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే సన్నబియ్యం ఇస్తామన్నారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రిస్క్లో పడుతామని.. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు ఖతమవుతుందన్నారు. భువనగిరి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీకి గులాములని.. కేసీఆర్కు తెలంగాణ ప్రజలే హై కమాండ్ అన్నారు. భువనగిరిలో ఐటీహబ్ నిర్మిస్తామన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి నిలకడ లేదని.. ఫైళ్ల శేఖర్ రెడ్డి గెలిస్తే సీనియర్ అవుతాడన్నారు. భువనగిరి మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.