హైదరాబాద్: తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏండ్లని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటూ తన ప్రాణాలను ఫణంగా పెట్టి 11 రోజుల ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ ఉద్యమ సంకల్పానికి కేంద్రం దిగివచ్చి తెలంగాణను ప్రకటించిందని ట్విట్టర్ వేదికగా గుర్తుచేసుకున్నారు. దీక్ష సందర్భంగా కేసీఆర్.. ఖమ్మం హాస్పిటల్, నిమ్స్ దవాఖానలో ఉన్నప్పటి ఫొటోలను షేర్ చేశారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అంటూ ప్రాణాలు ఫణంగా పెట్టి 11 రోజుల ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ గారి ఉద్యమ సంకల్పానికి.. కేంద్రం దిగివచ్చిన రోజు. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన ఆ చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏళ్లు.’
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అంటూ ప్రాణాలు ఫణంగా పెట్టి 11 రోజుల ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ గారి ఉద్యమ సంకల్పానికి.. కేంద్రం దిగివచ్చిన రోజు. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన ఆ చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏళ్లు. pic.twitter.com/QbDjtg7BMn
— Harish Rao Thanneeru (@trsharish) December 9, 2022