ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎంతో మాట్లాడతానని, త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం దక్కేలా చూస్తానని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. మంగళవారం నాడు రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మామిల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ నేతృత్వంలో నగర శాఖ కార్యదర్శి శ్రీకాంత్, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దాన్ని అందుకున్న హరీష్ రావు.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎం కేసీఆర్తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.