Harish Rao | సిద్దిపేట, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ శాసించింది.. రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పార్టీ అమలుచేసింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యాయన్న సంగతి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మాటలతో బట్టబయలైందని రాష్ట్ర ఆర్థికమం త్రి హరీశ్రావు పేర్కొన్నారు. బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెడితేనే రుణాలు తెచ్చుకొనేందుకు అనుమతిస్తామన్న కేంద్రం షరతులను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కూడా అమ లు చేశాయని ఈ విషయాన్ని స్వయంగా కేం ద్ర మంత్రి వెల్లడించారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో బుధవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం షరతులకు అంగీకరించిన రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్లు పెట్టి.. రైతుల ఇంటికి బిల్లులు పంపిస్తున్నారని చెప్పారు. కేంద్రం షరతులకు లొంగని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ‘అందువల్లనే తె లంగాణకు పైసలు ఆపినం’ అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ తోనే రైతులు సురక్షితంగా ఉన్నారని అన్నారు. ‘చేతులు జోడించి రైతులకు విజ్ఙప్తి చేస్తున్నా.. కాంగ్రెస్కు ఓటు వేస్తే బాయిలకాడ మీటర్లు పెట్టేందుకు ఆంగీకరించినట్టే’ అని చెప్పారు.
మభ్య పెట్టిన బీజేపీ నేతలు
మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని హరీశ్రావు విమర్శించారు. మీటర్లు పెట్టుమన్నట్టు రుజువుచేస్తే ఒక నాయకుడు ముక్కు నేలకు రాస్తా అంటే.. మరొకరు ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారని చెప్పా రు. ఇప్పుడు నిర్మలాసీతారామన్ కుండబద్ధలు కొట్టారని, బీజేపీ నేతలు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని నిలదీశారు. ఈ దేశంలో రైతు పక్షపాతి ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్ అన్న మరో సంగతి కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలో స్పష్టమైందని అన్నారు.
12 రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్లుదేశంలో 12 రాష్ర్టాలు మోటర్లకు మీటర్లు
పెట్టారని, తమ (కేంద్రం) వద్ద డబ్బులు తీసుకున్నారని, మరికొన్ని రాష్ర్టాలు దరఖాస్తు చేశాయని, వాటికి రేపో మాపో నిధులు విడుదల చేస్తామని కూడా నిర్మల చెప్పారని హరీశ్రావు గుర్తుచేశారు. దరఖాస్తు చేయనిది, రైతుల పక్షాన నిలిచింది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని దీనిని బట్టి రుజువవుతున్నదని చెప్పా రు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? కేంద్రం ఇచ్చే 25 వేల కోట్లు ముఖ్యమా? అన్నప్పుడు కేసీఆర్ రైతుల పక్షానే నిలిచారని వెల్లడించారు. కాం గ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాలు మోటర్లకు మీటర్లు పెడతామని చెప్పి పైసలు తెచ్చుకున్నారని చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సర్కార్ మీటర్లు పెడతామని అసెంబ్లీలో తీర్మానం చేశారని తెలిపారు. బీజేపీ పాలిత యూపీ, అస్సాం, మణిపూర్లో, ఇండియా కూటమి అధికారంలో ఉన్న తమిళనాడు, బెంగాల్, కేరళలో కూడా మీటర్లు పెట్టారని చెప్పారు. తప్పిపోయి రేపు తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీజేపీ గానీ గెలి స్తే.. మోటర్లకు మీటర్లు పెట్టి, ఉచిత కరెంట్ లేకుండా చేస్తారని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీ రైతుల పాలిట శత్రువులు
దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని హరీశ్రావు ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో కాంగ్రెస్ ఆ రిపోర్టును తుంగలో తొక్కిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని, దేశమంతా కాలికి బలపం కట్టుకొని తిరుగుతానని ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు. కానీ తొమ్మిదేండ్లు గడిచిపోయినా ఆ సిఫారసులను అమలు చేయలేదని మండిపడ్డారు. స్వామినాథన్ సిఫారసుల అమలుకు కాంగ్రెస్ ఏనాడైనా పోరాటం చేసిందా? అని ప్రశ్నించారు.
బీజేపీది గురివింద నీతి
అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పడం నిజంగా సిగ్గుచేటని హరీశ్రావు వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి దేశం మీద ఉన్న అప్పు దాదాపు రూ.55 లక్షల కోట్లు అని, ఇప్పుడు అది రూ.155 లక్షల కోట్లు దాటిందని చెప్పారు. దాదాపు ప్రతి నెల లక్ష కోట్లు అప్పు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని మండిపడ్డారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం గురివింద సామెతను గుర్తు చేస్తున్నదని అన్నా రు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకార మే.. జీఎస్డీపీలో తెలంగాణ అప్పుల వాటా 28% అని తెలిపారు. దేశ జీడీపీలో 57 శాతం అప్పులతో దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీజేపీది అని దుయ్యబట్టారు. రూపా యి విలువ తగ్గించింది, నిరుద్యోగ సమస్యల కు కారణం, బీడీ కట్టల మీద పన్ను వేసింది, సిలిండర్ ధరను 400 నుండి 1200కు పెం చింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణపై బీజేపీ కక్ష
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో కొంత ఆలస్యమైందని మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ర్టానికి నిధులు ఆపిన విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నిర్మల నిన్ననే అంగీకరించారని తెలిపారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆపి బీజేపీ మనమీద కక్ష కట్టిందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల సన్నిహిత ప్రభుత్వమని అంటూ.. రెండు పీఆర్సీలు ఇచ్చింది, తొమ్మిదేండ్లలో 133 శాతం వేతనాలు పెం చింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. గత కాం గ్రెస్ ప్రభుత్వాలు అంగన్వాడీ, ఆశ, వీఏవోల ను గుర్రాలతో తొకించిందని, ఆ పార్టీని న మ్మితే మోసపోతామని అన్నారు. వీఆర్ఏల ను, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసింది కేసీఆర్ అని చెప్పారు. సీపీఎస్ నుండి ఓపీఎస్ విధానానికి రాష్ట్రం కట్టుబడి ఉందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, చిన్నకోడూరు ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.
నూకలు తినమన్న బీజేపీకి నూకల్లేకుండా చేయాలి ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెప్పాలి.. దుబ్బాక రోడ్షోలో హరీశ్
తెలంగాణ రైతులను నూకలు బుక్కమని చెప్పిన బీజేపీకి రాష్ట్రంలో నూకలు లేకుం డా చేయాలని ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు మోటరుకు మీటర్ అంటుంటే కాంగ్రెస్ నేతలు 3 గంటల కరెంటు అంటున్నారని, ఆ రెండు పార్టీలను నమ్మితే మోసపోతామని హెచ్చరించారు. బుధవారం ఆయన దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మిరుదొడ్డి, భూంపల్లి-అక్బర్పేట, నార్సింగ్ మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మా ట్లాడుతూ.. రామక్క పాటలో ఎక్కడ కొట్టుకపోతామోనన్న భయం కాంగ్రెస్, బీజేపీకి పుట్టుకున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఒక్క రూపాయి పని కూడా చేయలేదని, ఇవాళ మళ్లీ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. బీజేపీ గెలిస్తే బోరు కాడ, బాయి కాడ మోటర్ వస్తదని చెప్పానని, ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బాయిలకాడ మీటర్లు తెలంగాణ ప్రభుత్వం పెట్టలేదని, అందుకే నిధులివ్వలేదని చెప్పారని గుర్తుచేశారు. ఆమె మాటలు విన్నాక రఘునందన్రావు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. ప్రభుత్వం భూములను గుంజుకుంటుందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అసైన్డ్ భూములకు పూర్తి హక్కు లు ఇచ్చేలా పట్టాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
ప్రభాకరన్నను చంపాలని చూశారు
బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకరన్నను కొందరు చంపాలని చూశారని మంత్రి హరీశ్రా వు ఆవేదన వ్యక్తంచేశారు. మీ అందరి ఆశీస్సు లు, దేవుడి దయతో బతికి బయటపడ్డారని చె ప్పారు. దీన్నికూడా కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
‘బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతోపాటు రామక్క పాటను సైతం కాంగ్రెస్ కాపీ కొట్టింది. రామక్క పాట ఇప్పుడు తెలంగాణలో దుమ్మురేపుతున్నది. సీఎం కేసీఆర్ మీద ప్రేమతో కల్వకుర్తికి చెందిన ఒక చెల్లి రాసిన పాటతో కాంగ్రెస్, బీజేపీ గుండెలు ఝల్లుమంటున్నాయి’
-మంత్రి హరీశ్రావు