ఎన్నికలు రాగానే అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ కలిసి ఎన్నో బూటకపు మాటలు చెప్తాయి. ప్రజలు నమ్మి మోసపోవద్దు. సాగుకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ అంటున్నారు. 24 గంటల కేసీఆర్ కావాల్నా? లేక మూడు గంటల కాంగ్రెస్ పార్టీ కావాల్నా? అనేది ప్రజలే తేల్చుకోవాలి.
-మంత్రి హరీశ్రావు
వరంగల్/ములుగు/మహబూబాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తేతెలంగాణ): అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనే క అబద్ధాలు చెప్తున్నదని, అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కు లు చేసినా ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆరోగ్య విప్లవాన్ని స్పష్టించడంతోపాటు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారని, దీంతో దేశంలోనే తెలంగాణ డాక్టర్ల తయారీ కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. గురువారం ఆయన వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగును జిల్లాగా చేసి, ప్రస్తుతం మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకానికి స్ఫూర్తి ములుగు జిల్లా అని గుర్తుచేశారు. ములుగు ప్రజల ఆకాంక్షను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, అదనంగా డబుల్ ఇండ్లను మంజూరు చేయడంతోపాటు ఏటూరునాగారం ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణలో కేవలం రెండే రెండు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశాయని, 30 ఏండ్లకో కాలేజీ చొప్పున నెలకొల్పారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కానీ, తెలంగాణలో తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో 29 ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరయ్యాయని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలో నంబర్వన్ స్థానంలో ఉన్నదని, ధాన్యం దిగుబడి, డాక్టర్ల ఉత్పత్తి, ఇంటింటికి తాగునీటి సరఫరా, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు సరఫరాలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు వల్ల వైద్య విద్యతోపాటు స్థానికంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని, 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు.
కాంగ్రెస్ హామీలు చూస్తుంటే కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్న చందంగా ఉన్నది. కాంగ్రెస్ పాలన వస్తే ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరుగురు సీఎంలు మారుతరు. మత కలహాలు, కొట్లాటలు మొదలైతయి.
-మంత్రి హరీశ్రావు
తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా తెలంగాణలో మో దీ ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒకటి కూడా లేదని, అదే పకనున్న ఏపీకి 8 ఇచ్చి తెలంగాణ పైన వివక్ష చూపిందని మండిపడ్డారు. రైతుల ప్రభుత్వం కావాలన్నా, రైతు రాజ్యం ఉండాలన్నా మళ్లీ సీఎం కేసీఆర్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ సర్వనాశనం అవుతుందని, తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే బీఆర్ఎస్ను గెలుపించుకోవాలని తెలిపారు. సస్యశ్యామల తెలంగాణ కావాల్నా? సర్వనాశనమయ్యే తెలంగాణ కావాల్నా? ప్రజలే ఆలోచించాలని సూచించారు. ఈ రోజు తెలంగాణలో ఎకరం భూమి రూ. 40 లక్షల ధర పలుకుతుందని మంత్రి దయాకర్రావు చెప్పారని, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇంత ధర లేదనేది ఆలోచించాలని రైతులను కోరారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మహబూబాబాద్ జిల్లా అయిందని, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, హార్టికల్చర్ డిగ్రీ కాలేజీ వచ్చాయని తెలిపారు. వరంగల్ నగరంలో రూ.1,100 కోట్లు వెచ్చించి 24 అంతస్థులతో భారీ హెల్త్ సిటీని నిర్మిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలో ఎల్కేజీ ఫీజు కంటే తక్కువ ఫీజుతో డాక్టర్ విద్య అందిస్తున్నాం. తెలంగాణ విద్యార్థులకు కేవలం ఏడాదికి రూ.10 వేల ఫీజుతో ఎంబీబీఎస్ చదువుకొనే అవకాశం లభించింది. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ టాప్ వన్లో నిలిచింది. వైద్యవిద్య కోసం గతంలో తెలంగాణ నుంచి విద్యార్థులు ఇతర రాష్ర్టాలు, దేశాలకు వెళ్లేవారు. నేడు ఇంటి వద్ద ఉండి వైద్య విద్య చదువుకునేలా సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేశారు.
-మంత్రి హరీశ్రావు
ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్గా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్షత చూపిందని, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా సీఎం కేసీఆర్ సొంతంగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వైద్యుల తయారీ కర్మాగారంగా రాష్ట్రం మారబోతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి పేదవాడిని అర్హుడిగా గుర్తిస్తూ సీఎం కేసీఆర్ కడుపునిండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని ప్రాంతాలకు గోదావరి జలాలను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధమవుతున్నదని వెల్లడించారు. కార్యక్రమాల్లో ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, రెడ్యానాయక్, శంకర్నాయక్, హరిప్రియానాయక్, సీతక్క, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తాతా మధు, తక్కళ్లపల్లి రవీందర్రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ములుగు జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్రావు, రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, రోడ్డు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రూ.10 కోట్లు, ఎకరం భూమికి ఎమ్మెల్యే సీట్లను అమ్ముకున్నట్టు ఆ పార్టీ నాయకులే నిన్న బయటపెట్టారు. నేడు టికెట్లు అమ్ముకొన్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ర్టాన్ని కూడా అమ్ముకుంటుంది.
-మంత్రి హరీశ్రావు