Harish Rao | శ్రీశైలంలో తెలంగాణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. యాత్రికులు బస చేసేందుకు ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మించారు.
ఈ భవన నిర్మాణానికి శ్రీశైలం దేవస్థానం వారు అందించిన సహకారాన్ని కూడా మంత్రి హరీశ్రావు కొనియాడారు. ఆర్య వైశ్యులు వర్తక వ్యాపారాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాలను చేయడంలో కూడా ముందంజలో ఉంటారని అన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఆశీస్సులు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అందుతూ ఆయురారోగ్యాలతో బాసిల్లాలని మంత్రి హరీశ్రావు కోరుకున్నారు