Minister Harish Rao | మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మెదక్ షాదీఖానాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్, జిల్లా మైనార్టీ అధికారి జమ్లా నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి రూ.250 కోట్ల కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో ముస్లిం మైనార్టీలకు 250 ఇండ్లు కేటాయించడం జరిగిందని, మిగిలిపోయిన అర్హులైన వారికి కూడా ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కిచెన్ షెడ్, నిర్మాణానికి రూ.20లక్షల అందించనున్నట్లు వివరించారు.