హుజూరాబాద్ : పక్క పార్టీలు ఆశ చూపే కుంకుమ భరణి, గడియారాలకు జర ఆగం కావొద్దు.. అవి తిండి పెట్టవు అని మంత్రి హరీశ్రావు సూచించారు. హుజూరాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు. గడియారాలు, కుంకుమ భరణిలకు మోసపోవద్దు. అందులో మర్మమేందో గ్రహించాలి. చిన్నచిన్న వాటికి ఆశపడకండి. ఎండమావుల వెనుక పరుగెత్తితే మనకు ఏం రాదు అని హరీశ్రావు పేర్కొన్నారు.
దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే రావు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. పని చేయించుకునే హక్కు మీది.. చేసే బాధ్యత మాది. మీ ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. మేం మీ సేవకులం. దేవుడిచ్చిన శక్తితో మీకిచ్చిన హామీలను నెరవేరుస్తాం. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. చెప్పుడు మాటలకు, మొసలి కన్నీళ్లకు మోసపోవద్దు. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. దీవించండి. న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించండి అని మంత్రి హరీశ్రావు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.