సిద్దిపేట, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేటకు చెందిన పీ కనకవ్వ, అంజయ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా జన్మించారు. మార్చి 27న సిద్దిపేటలో వాణి, వీణ పెండ్లి ఒకేసారి చేశారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్కరి రూ. 1,00,116 చొప్పున మంజూరయ్యాయి.
ఆర్థిక మంత్రి హరీశ్రావు సిద్దిపేటలో శుక్రవారం రెండు చెక్కులను వారి తల్లి కనకవ్వకు అందజేశారు. దీంతో వాణి, వీణల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు ఎంతో సాయం చేస్తున్నారని కొనియాడారు.