హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వడ్డీ లేని రుణాలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులపై శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్వహణ కోసం రూ.1,867 కోట్లతో చేపట్టిన పనులతోపాటు గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లుల గురించి చర్చించారు. రాబోయే రెండు ఆర్థిక త్రైమాసికాలకు సంబంధించిన నిధులపై అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆసరా పెన్షన్ల విషయంలో ఎకడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగేవిధంగా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.