హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రేషన్కార్డు లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవైసీ ప్రక్రియ వల్ల రాష్ట్రంలోని లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్గోయల్కు సోమవారం ఆయన లేఖ రాశారు. గతంలో తెలంగాణకు చెందిన చాలామంది రేషన్ లబ్ధిదారులు బతుకుదెరువు కోసం విదేశాలకు, దూరప్రాంతాలకు వలస పోయారని, వీరంతా వచ్చి కేవైసీ చేయించుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కేవైసీని కచ్చితం చేయడం వల్ల వీరంతా నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. కేవైసీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. కేవైసీతో కలిగే ఇబ్బందులపై ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల ప్రయోజనాలను కచ్చితంగా కాపాడుతుందని భరోసా ఇచ్చారు.
కేంద్రం అనాలోచిత నిర్ణయం.. ఆందోళనలో లబ్ధిదారులు
రేషన్కార్డుల్లో పేర్లు ఉన్నవారంతా కేవైసీ చేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేవైసీ ఎలా చేయించుకోవాలి? ఎక్కడ చేయించుకోవాలి? ఎప్పటిలోపు చేయించుకోవాలి? వేలిముద్రలు పడకపోతే ఏమి చేయాలి? తదితర అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో రేషన్కార్డుదారులు అయోమయానికి గురవుతున్నారు. కార్డుల్లో పేర్లు ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కోచోట ఉన్నా రు. బతుకు దెరువు కోసం గల్ఫ్తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు చాలామం ది ఉన్నారు. ఇప్పుడు వీరం తా కేవైసీ కోసం తిరిగి దేశానికి రావాలా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు కార్డుల్లోని చిన్నపిల్లల వేలిముద్రలు సరిపోవడం లేదు. ఆధార్ నమోదు సమయంలో చిన్నపిల్లల వేలిముద్రలు గానీ ఐరిస్ గానీ తీసుకోరు. ఇప్పుడు వారిని ఏవిధంగా కేవైసీ చేయాలో తెలియక తల్లిదండ్రులు, రేషన్షాపుదారులు తలపట్టుకుంటున్నారు. ఒకవేళ కేవైసీ చేయించుకోని పక్షంలో కార్డులో నుంచి పేరు తొలగిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. కేవైసీ ప్రక్రియ పూర్తిగా కేంద్రం ఆదేశాలతో చేస్తున్నదే తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని అధికారులు చెప్తున్నారు.