యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్లతో పాటు రాష్ట్రంలోని కరోనా బారినపడ్డ ప్రజలు కూడా త్వరగా కోలుకొవాలని యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు చేశారు.
అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని, కరోనా పీడ త్వరగా వదిలి పోవాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రి వెంట టీఎస్ఐఐసీ చైర్మన్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మో్హన్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు