మేడ్చల్ మాల్కాజిగిరి : ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లి అమానుషత్వానికి పాల్పడింది. తల్లి పొత్తిళ్లలో సేదతీరాల్సిన చిన్నారిని కర్కశంగా వదిలివెళ్లింది. ఈ అమానవీయ సంఘటన జిల్లాలోని జీడిమెట్ల గాజులరామారంలో చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వైపు వెళ్లే ఆటోలో ఓ తల్లి తన బిడ్డతో కలిసి ఎక్కింది.
ఆడశిశువు అనే కారణంతో ఆ బిడ్డను వదిలించుకోవాలని భావించిన ఆ తల్లి తను ఎక్కిన ఆటోలోనే చిన్నారిని వదిలి వెళ్లిపోయింది.
కొద్దిసేపటికి బిడ్డ అరుపులు విన్న ఆటో డ్రైవర్ రాజు పోలీసులకు సమాచారం అందించగా.. వారు షాపూర్ నగర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చైల్డ్ వెల్ఫేర్ టీమ్ కు పిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు
భారత్కు చేరిన అమెరికా అత్యవసర సాయం