వరంగల్ : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కరోనా నుంచి త్వరగా కోలుకొని ప్రజా సేవ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేశారు.
కొవిడ్ బారిన పడ్డ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, కరోనా పీడ త్వరగా వదిలి పోవాలని శుక్రవారం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తదితరులు ఉన్నారు.