హైదరాబాద్, అక్టోబర్ 2 : పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు.. తెలంగాణ ఆడపడుచులకు మంత్రి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఒక్కరు పండుగని ఆనందోత్సాహాల మధ్య తగు జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. రూ.339.73 కోట్లతో కోటికి పైగా మహిళలకు వివిధ డిజైన్లలో చీరలు పంపిణీ చేస్తుందన్నారు.