హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న మృతి చెందిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మంత్రి ఎర్రబెల్లి వెంట ఢిల్లీ తెలంగాణ ప్రతినిధి వేణుగోపాల చారి తదితరులు ఉన్నారు.