హనుమకొండ : మాట తప్పని, మడమతిప్పని మనుసున్న మహారాజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణను ప్రకటించిన సందర్భంగా సీఎం కేసీఆర్(CM KCR) చిత్రపటానికి హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జేపీఎస్(JPS)లతో కలిసి మంత్రి క్షీరాభిషేకం చేశారు.
మంత్రి మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్(Regularize,) ప్రక్రియను చేపట్టడం హర్షణీయం అన్నారు. జేపీఎస్లను రెగ్యులరైజ్ చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు(Committes) వేశామని వెల్లడించారు. ఈ కమిటీలు ప్రక్రియను చేపట్టి, నివేదికలు ఇస్తాయని, నివేదికలు రాగానే జేపీఎస్లను రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు.
జీపీఎస్ల రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్ జూనియర్ సెక్రటరీ(Junior Panchayat Secretaries) ల విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటన తరువాత హరీశ్రావు, తాను, చీఫ్ సెక్రటరీ సమావేశమై రెగ్యులరైజ్ విధి విధానాలు చర్చించామని వివరించారు.
జేపీఎస్లు సీఎం కేసీఆర్కు రుణపడి ఉండడంతో పాటు ముఖ్యమంత్రిని గుర్తు పెట్టుకుంటారన్నారు. తమను క్రమబద్ధీకరించేందుకు ప్రక్రియ చేపట్టిన సీఎం కేసీఆర్కు, మంత్రి ఎర్రబెల్లికి జేపీఎస్లు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.