తొర్రూరు అక్టోబర్ 8 : కాంగ్రెస్ పార్టీ బ్రోకర్ మాటలను నమ్మొద్దు. వాళ్లు డబ్బు సంచులతో వచ్చి ఉపన్యాసాలు దంచిపోతారు. ప్రజలకు మొండి చేయి చూపిస్తారు. ఎప్పటికైనా తెలంగాణకు సీఎం కేసీఆర్ పరిపాలనే శ్రీరామరక్ష. సార్ ను నమ్ముకుంటే మనం చల్లంగా ఉంటామని పంచాయతీ రాజ్ శాఖ మత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabell) అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో ప్రముఖ రియాల్టర్ బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాగా, ఆయన ఈరోజు తొర్రూరులో భారీగా నిర్వహించిన యాదవ సింహ గర్జన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ దుష్ట పరిపాలనతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. జనాలకి ఇచ్చేది లేదు అని అన్నారు. అలాంటి వాళ్లను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే నని చెప్పారు.
బీఆర్ఎస్లో చేరిన బొమ్మన బోయిన రాజేందర్కు త్వరలోనే తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చూసే బాధ్యత నాదని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకొని ప్రజాసేవకే అంకితమైన రాజేందర్ను కడుపులో పెట్టుకునే బాధ్యత నాదేనని మంత్రి తెలిపారు.
అనంతరం తొర్రూరులోని అయ్యప్ప గుడికి బొమ్మనబోయిన రాజేందర్ యాదవ్ అందించిన 15 లక్షల రూపాయల చెక్కును మంత్రి తన చేతుల మీదుగా సంబంధిత దేవాలయ ట్రస్టుకు అందజేశారు. అలాగే మంత్రి సైతం10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గంగమ్మ గుడి దేవాలయ నిర్మాణానికి మంత్రి మరో 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.