మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల శ్రావణ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన ఆయనకు నిమ్స్ హస్పిటల్లో మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రెండు లక్షల రూపాయల ఎల్వోసీని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వాళ్లకు తక్షణ సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదల పాలిట ఆపద్భంధు అని ప్రశంసించారు. ఒక వైపు ఆరోగ్యశ్రీ ఉన్పప్పటికీ తక్షణ వైద్య సహాయానికి సీఎంఆర్ఎఫ్ ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావుకు, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.