ఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా.. ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో పీవీకి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు.
అలాగే మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీలు బండా ప్రకాశ్, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు పీవీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.