హనుమకొండ : ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన బహుముఖ ప్రజ్ఞశాలి, సంస్కరణలకు ఆధ్యుడు దిగవంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ జయంతి సందర్భంగా హనుమకొండలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పీవీ హంగు, ఆర్భాటాలు లేని సాదా సీదా సహజ నాయకుడు. తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత అని ప్రశంసించారు. పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వoగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇప్పటికే, నేను, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి లక్నేపల్లి ని సందర్శించామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీని పట్టిచుకోకపోయినా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోని 50 దేశాలలో పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించిందన్నారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని, వారి చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారని ఆయన తెలిపారు. అలాగే పీవీకి భారతరత్న ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు.