హైదరాబాద్, ఆక్టోబర్ 2 : గాంధీజీ, మాజీ ప్రధాని, లాల్ బహదూర్ శాస్త్రి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు ఈ ముగ్గురు మూడు శిఖరాలు. వ్యక్తిత్వంలో మహోన్నతులు పోరాటాల్లో వెన్ను చూపని వీరులు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆ ముగ్గురు నేతల జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాలం చాలా గొప్పది.యాదృచ్ఛికంగా ఆ ముగ్గురు నేతల జన్మ తేదీ ఒకటే కావడం, వారిలో ఎవరి దారులు వారివి వేరైనా, వారి గమ్యస్థానం మాత్రం ప్రజా శ్రేయస్సే అన్నారు.
వారి త్యాగాలు వృథా కాలేదని, సీఎం కేసీఆర్ రూపంలో వారి ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని చెప్పారు. ఆ మహనీయుల ఆలోచనలక అనుగుణంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపారన్నారు.