వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో కలిసి నగరంలో పర్యటించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలను అలాగే హన్మకొండ నయీం నగర్ వద్ద పెద్ద మోరీ ప్రవాహాన్ని పరిశీలించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం