తొర్రూరు, సెప్టెంబర్ 6 : సామాజిక సేవలో ఆర్య వైశ్యులు ముందున్నారు. అనేక సేవా కార్యక్రమాలతో తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలాగే తొర్రూరులో వాసవీ క్లబ్, వాసవీ వనితా క్లబ్ సేవలు వెల కట్టలేనివని వారిని అభినందిస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ ప్రదమైంది. గురువులను దేవుడితో సమానంగా చూసే సంస్కృతి మనది అని పంచాయతీరాజ్ సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తొర్రూరు వాసవీ క్లబ్, వాసవీ వనితా క్లబ్ల ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవంలో పాల్గొని పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అలాగే తొర్రూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. మరింత అభివృద్ధి చేయడానికి మరో అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ గోపారపు రామా ఉపేందర్, జిల్లా ఇన్చార్జి ప్రొద్దుటూరి గౌరీ శంకర్, జోన్ చైర్మన్ గార్లపాటి నిఖిల్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్, కాటన్ ఇండస్ట్రీస్ రాష్ట్ర ప్రతినిధి రేవూరి వెంకన్న, క్లబ్ ప్రధాన కార్యదర్శులు చిదిరాల నవీన్ కుమార్, చీదర నీలిమ కోశాధికారులు చీదర మహేష్, చిదిరాల గీత, ఉపాధ్యక్షుడు బిజ్జాల అనిల్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మచ్చ సోమయ్య, వాసవి దేవస్థాన కమిటీ అధ్యక్షుడు చలువాది సత్యనారాయణ, వజినపల్లి అనిల్ కుమార్, వజినపల్లి దీప పాల్గొన్నారు.