జనగామ : అన్ని వర్గాల ప్రజలతో పాటు, మైనార్టీలను సైతం అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయం కింద పలువురు మైనార్టీలకు పాలకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మైనార్టీలకు చత్రలో లేనంతగా ఎంతో మేలు జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమ దృష్టితో చూస్తూ పాలన అందిస్తున్నారని చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలు పార్టీలకు అతీతంగా తెలంగాణలోని ప్రతి గడపకు చేరుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే మైనార్టీలు కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.