మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదలు పెట్టారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించు కుం టున్నాం. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బుధవారం తొర్రూరు మండలం గుర్తూరు, హరిపి రాల, తొర్రూరు మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మాట్లాడారు. రాష్ట్రంలో కోటికి పైగా మందికి బతుకమ్మ చీరలు అందుతున్నాయి. ఈ సంవత్సరం విభిన్న డిజైన్లు ఆకర్షణీయమైన రంగులలో చీరలు నేయించామన్నారు.
బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. బీఆర్ఎస్ గెలుపుతోనే రాష్ట్రానికి రక్షణ ఉంటుందన్నారు. అందరి సంక్షేమ కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.