Minister Errabelli Dayaker rao | ఏ రైతు అయినా సరే తన పొలాన్ని చూసిన వెంటనే మురిసిపోతాడు. వ్యవసాయం చేస్తూ నిరంతరం శ్రమిస్తాడు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రైతుగా అవతారమెత్తాడు. తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి వెళ్లాడు… గొర్రు పట్టి దున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కూలీలతో కలిసి, వారి పాటలకు గొంతు కలిపి నాట్లు వేశారు దయాకర్ రావు.
దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేస్తే…ఆ వ్యవసాయాన్ని మంత్రులు కూడా పొలంలోకి దిగి గొర్రు కొడుతున్నారు. మా నాయకుని ఆశయ సాధనలో అడుగులు వేస్తాం అనడమే కాదు.. నేరుగా వ్యవసాయం చేస్తాం.. రైతు రాజు అయితే.. రాజు కూడా రైతు అనే దానిని రుజువు చేస్తున్నారు.
కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది. గతంలో నెర్రెలు పారిన పొలాలు.. స్వరాష్ట్రంలో ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయి. అన్నదాత కళ్లలో ఆనందం కనిపిస్తుంది.
అపర భగీరథుడు కేసీఆర్ ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొంది, నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే… చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే… మంత్రులు కూడా సొంత పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తుంటే…ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయి. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్న నినాదం నిజం అయ్యింది.
తన సొంత పొలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కూలీలతో కలిసి నారు తీశారు.. అనంతరం గొర్రు దున్ని.. రైతుల దృష్టిని ఆకర్షించారు.. pic.twitter.com/RvL6XYzw9b
— Namasthe Telangana (@ntdailyonline) December 27, 2022