Minister Dayakar Rao | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం దర్శించుకున్నారు. ప్రత్యేక వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.