హైదరాబాద్ : సీఎం కేసీఆర్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసినందుకు మంత్రి ధన్యవాదాలు చెప్పారు. మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల గౌరవ వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.13వేలకు, ఎంపీటీసీలు, సర్పంచుల వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.6500 వరకు పెంచినట్లు మంత్రి చెప్పారు. పెంచిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఉన్నా స్థానిక సంస్థలకు నిధుల్లో కోత విధించకుండా విడుదల చేస్తున్నారని చెప్పారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరింత క్రీయాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయాలన్నారు.