Minister Errabelli Dayakar Rao | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేసిన ప్రజలకు సహకారం అందించాలని సూచనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, వర్షాకాల సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల పరిస్థితి పై మంత్రి ఆరా తీశారు. వెంటనే జిల్లా అధికారులు, డీపీవోలు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప వర్షాలు తగ్గేవరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు