మహబూబాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. కాగా, వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు జోరుగా మత్తడి పోస్తున్నది.
అయితే రోడ్డు పైనుంచి వరద పారుతుండటంతో ఆర్యభట్ట స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకున్నది. స్థానికులు అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అతా ఊపిరి పీల్చుకున్నారు.