హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తోన్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలకు వరద పోటెత్తింది. చెరువులు అలుగు పోస్తున్నాయి.