చండూరు: మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వాడవాడన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకు తిరుగుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తో సాధ్యమని అందువల్ల పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు.
ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చండూరు మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలోని ఒకటి, రెండో వార్డుల్లో ఇళ్లిళ్లూ తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కారు, సారు, సర్కారును మరవొద్దని సూచించారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపించాలన్నారు.
అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తున్న కారును పోలీసులు తనిఖీ చేశారు. పలివెల చెక్పోస్టు వద్ద మంత్రి కాన్వాయ్ని ఆపిన పోలీసులు.. ఆయన కారుతోపాటు మిగిలిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
గట్టుప్పల్ మండలంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. మునుగోడులో నిలిచిన అభివృద్ధి కొనసాగాలనే ఉపన్నికల్లో తనను గెలిపించాలన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన రాజగోపాల్ రెడ్డి.. కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయాడని విమర్శించారు.