వరంగల్: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని చెప్పారు.
ఏటా నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వరంగల్ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.