తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన సోమవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.
ఏటా వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతికి రావడం తనకు ఆనవాయితీ అని, ఆ శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టమని తెలిపారు. శ్రీవారి ఆశీర్వాదం, అనుగ్రహం సీఎం కేసీఆర్కు ఉన్నాయని, ఆ అనుగ్రహంతో మరెన్నో ప్రజోపయోగ పనులు చేస్తారని వెల్లడించారు.