Errabelli Dayakar Rao | జనగామ, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘గోడలపై పేర్లు రాసెటోడివి.. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినోడివి.. నువ్వొక బ్రోకర్.. చీటర్.. పైసలకు అమ్ముడుబోయే క్యారెక్టర్లెస్ గాడివి.. నువ్వెంత? నీ బతుకెంత? అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈవో పనిచేసిన కేటీఆర్ను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతావా?’ అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన జనగామలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, జెడ్పీ చైర్మన్ సంపత్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది.. డబ్బులకు టికెట్లు అమ్మకుంటున్నారు’ అని సొంత పార్టీ వారే అంటున్నారని తెలిపారు. రేవంత్రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి.. అసెంబ్లీ అభ్యర్థుల టికెట్లను ఫర్సేల్కు పెట్టి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ‘నీ లాగా మాకు రోత మాటలు రావు.. నువ్వు తిమ్మిని బమ్మి చేస్తావ్.. గోడలకు పెయింటింగ్ వేసేటోడివి.. నువ్వు, నీ బతుకు గురించి ఆలోచించు. నీ కుటుంబమేంది? నీ బతుకేంది?’ అని మంత్రి ఎర్రబెల్లి భగ్గుమన్నారు.
‘ఏడాదికో పార్టీ మారే బతుకు నీది.. కొడంగల్లో చిత్తుగా ఓడిపోయినోడివి.. బ్రోకర్ మాటలెందుకు.. దమ్ముంటే రంగారెడ్డి జిల్లాలో పోటీచేసి గెలువు’ అని సవాల్ విసిరారు. రేవంత్ రాగానే కాంగ్రెస్ పని ఖతమైపోయిందని, పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందని, 15న బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకు పోతుంది’ అని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదని, పక రాష్ట్రాల్లో 6 గ్యారెంటీలు ఇయ్యని వారు, ఇకడ ఇస్తామంంటే ఎట్ల నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తామని, రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏ ఒకటి చేయలేదని గుర్తుచేశారు.
పొన్నాలను స్వాగతిస్తున్నాం..
పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నాయకుడని, ఆయన జనగామకు ఎంతో సేవ చేశారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పొన్నాలను పార్టీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. ఐదు పార్టీలు మార్చిన రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి పొన్నా ల లాంటి సీనియర్ నేతను తిట్టడం సిగ్గుచేటని అన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రాజకీయ విలువలను దిగజారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాల 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, 10 ఏండ్ల కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకొని పనిచేసిన చరిత్ర ఆయనదని కొనియాడారు. ‘నువ్వు పార్టీలోకి మధ్యలో వచ్చావ్. దందాలు చేసినోడివి.. రెండుసార్లు ఓడిపోతే మళ్లీ టికెట్ తీసుకోలేదా? పొన్నాల అడిగితే తప్పేంటి’ అని ప్రశ్నించారు.