పెద్దవంగర, నవంబర్4: ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచి, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గిరిజన తండాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లుండే.. స్వరాష్ట్రంలో ఎైట్లెనవో ఆలోచించాలని సూచించారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం కాన్వాయిగూడెం, కొత్తతండా, మేఘ్యా తండా, బలుసుల తండా, అమర్సింగ్ తండా, రంగి తండా, బత్తాయితోట తండా, శంకర్ తండా, సర్పంచ్ తండాల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు.
ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి మాట్లాడారు. ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కేసీ ఆర్ తీర్చితే.. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చుపెట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని, ఆ పార్టీలను తరిమికొట్టాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నామినేషన్ ఖర్చుల నిమిత్తం తొర్రూరు మండలం మడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు-మాధవి దంపతులు రూ. 10 వేలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. కాగా.. కాన్వాయిగూడెంలో ఓట్లు అభ్యర్థిస్తున్న క్రమంలో వృద్ధురాలు కా సాని మల్లమ్మను ‘అవ్వా బాగున్నావా? పింఛ న్ వస్తున్నదా? ఓటు ఎవలికి వేస్తావు? అని ఎర్రబెల్లి అడగగా.. వస్తుందయ్యా.. నీకే ఓటు వేస్తాను.. కారు గుర్తుకే.. మళ్లా గెలుపు నీదే.. సీఎం కేసీఆర్ మళ్లా రావాలే.. ఆయనొస్తేనే మాలాంటోళ్లకు ఆసరా’ అని బదులిచ్చింది.