పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గిరక తాటి చెట్టు ఎక్కి.. స్వయంగా గీసి కిందకు దించి కల్లు తాగారు. మూడేండ్ల క్రితం సొంత ఖర్చుతో తాటి మొక్కలను సొసైటీలకు అందజేసి నాటించారు.
అప్పుడప్పుడు వచ్చి తాళ్లను పరిశీలించేవారు. గురువారం స్వయంగా చెట్టు ఎక్కి కల్లు తీసి తాగి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరా సేవిస్తే ఆరోగ్యానికి మంచిదని, హైదరాబాద్లో ప్రారంభించిన నీరా కేఫ్కు మంచి స్పందన వస్తున్నదని తెలిపారు.
– పాలకుర్తి