నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, ఏప్రిల్ 20: 60 ఏండ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో వారి కష్టాలన్నీ తీరాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. గురువారం పెద్ద ఎత్తున నిర్వహించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం, ధర్మాపురం గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారినట్టు తెలిపారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 58, 59 జీవోల ద్వారా అర్హత కలిగిన నిరు పేదలకు పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, నియోజకవర్గ ఇన్చార్జి పురాణం సతీష్, జడ్పీ చైర్మన్ అంగోతు బిందు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సాధించిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో చర్చ పెట్టాలని, ఎన్నికల వేళ వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని పెరుక కల్యాణ మండపంలో జరిగిన సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మతోన్మాదంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో నిర్వహించిన సమ్మేళనంలో జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా ఇన్చార్జి నర్సారెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల ఆత్మీయ సమ్మేళనాన్ని చెన్నూర్లో నిర్వహించగా సుమారు ఆరువేల మందికిపైగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో విప్ బాల్క సుమన్, ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో నిర్వహించిన సమ్మేళనానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం సదగోడులో నిర్వహించిన సమ్మేళనానికి విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్ల పేరుతో ప్రజలపై పడే తోడేళ్ల గుంపుతో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. హనుమకొండలోని 4వ డివిజన్ పెద్దమ్మగడ్డలో గురువారం 4,5,6,8వ డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తుంటే ఇతర పార్టీలు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.