జనగామ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని కోడకండ్ల మండలం రామేశ్వరం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు నాయక్, మాజీ సర్పంచ్ లాలు నాయక్, మండల ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు కిషన్, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పాలకుర్తి మండల విస్నూర్ గ్రామ కుమ్మరి, ఈరవెన్ను గ్రామ మైనార్టీ సంఘాలు మద్దతు తెలిపాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లో గల మంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసి తమ మద్దతు తెలిపారు.
అలాగే ఈరవెన్ను గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు.. గ్రామంలో రూ.30 లక్షల రూపాయలతో నిర్మించుకున్న నూతన మసీదు భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. అక్టోబర్ 3 వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.